ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా చూసి మహేశ్ బాబు ఏమన్నారంటే..?

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఈ సంగతులు అలా పక్కనబెడితే..ప్రభాస్ మాస్ , కమర్షియల్ సినిమాలే కాదు సెన్సిబుల్ లవ్ స్టోరి ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఫిల్మ్స్ కూడా చేశారు.

ఆ కోవకు చెందిన చిత్రాలు ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ పిక్చర్ ను దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. కాగా, ఈ సినిమా చూసి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిదా అయిపోయారు. ఆయన దిల్ రాజుకు ఫోన్ చేసి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

‘మిస్టర్ పర్ఫెక్ట్’ పిక్చర్ విడుదలైన తర్వాత ఆ సినిమా చూసిన మహేశ్ బాబు.. దిల్ రాజుకు ఫోన్ చేసి.. కమర్షియల్ , మాస్ హీరోతో ఇంత చక్కటి ఫ్యామిలీ ఫిల్మ్ తీశారని కొనియాడారు. తనకు ఆ చిత్రం బాగా నచ్చిందని చెప్పారు. ఇక ఆయనతో మాట్లాడిన క్రమంలోనే దిల్ రాజు ..మహేశ్ కు తన వద్ద..ఒక ఐడియా ఉందని చెప్పాడట. అలా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం అడుగులు పడ్డాయి.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తీసుకుని మహేశ్ వద్దకు వెళ్లి స్టోరి వినిపించారు.ఆయనకు నచ్చింది. అలా ఆ తర్వాత వెంకటేశ్ కు స్టోరి వినిపించారు.

అలా ‘పెద్దోడు’, ‘చిన్నోడు’.. వెంకటేశ్, మహేశ్ బాబులతో మల్టీస్టారర్ ఫిల్ల్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ స్టా్ర్ట్ అయి షూటింగ్ పూర్తి చేసుకుని బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news