మొహన్ బాబు కి షాకులిస్తున్న కొడుకులు ..!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉండి స్టార్ హీరోలు అవని వాళ్ళెవరైనా ఉన్నారంటే అది మంచు ఫ్యామిలీ హీరోలు మాత్రమే. తండ్రి మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. నిర్మాతగా, హీరోగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుండి మేజర్ చంద్ర కాంత్ వంటి ఎన్నో గొప్ప సినిమాలొచ్చాయి. అయితే మోహన్ బాబు కొడుకులు మాత్రం తండ్రి స్థాయిలో రాణించలేకపోతున్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు స్టార్స్ గా ఎదగలేకపోతున్నారు. ఈ హీరోలకి ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘ఓటర్’ అలాగే మనోజ్ నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలు దారుణమైన డిజాస్టర్స్ గా మిగిలాయి.

 

ఇక తాగాజా ఈ బ్రదర్స్ ఇద్దరూ కొత్త సినిమాలతో రావాలని సన్నాహాలు చేస్తున్నారు. విష్ణు ‘మోసగాళ్ళు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఓ ఫారిన్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘కన్నప్ప’ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాని రూ.95 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నామని… ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతుందని అంటున్నారు.

ఇక మనోజ్ కూడా భారీ బడ్జెట్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్న పేరుతో పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నామని అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్లని అట. అయితే మనోజ్ మీద కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయడం చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అన్న సినిమాకి 95 కోట్ల బడ్జెట్ తమ్ముడు సినిమాకి 30 కోట్ల బడ్జెట్ అంటే వర్కౌట్ అయ్యో పనేనా అంటూ ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. నిజంగా ఈ బడ్జెట్ విషయం మోహన్ బాబు కి తెలుసా .. తెలిస్తే షాకే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news