Virupaksha : కమ్ బ్యాక్ అదిరింది అల్లుడు.. సాయిధరమ్ తేజ్ కు చిరు ప్రశంస

-

రోడ్ యాక్సిడెంట్ తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సోనియా సింగ్ ఫిమేల్ లీడ్స్‌గా నటించారు.

తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అయితే విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద ‘విరూపాక్ష’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనం పడుతున్నారు. మరోవైపు సెలెబ్రెటీలు కూడా తేజ్ యాక్టింగ్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ.. సాయిధరమ్‌ తేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ యాడ్ చేశారు.

“విరూపాక్ష గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి! ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను డియర్ తేజు. నీ కమ్‌బ్యాక్ దద్దరిల్లింది. ఈ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు చిరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version