నాగచైతన్య-సమంతల సంసారం, విడాకులపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

-

సెలబ్రిటీ కపుల్ అయిన నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. సోషల్ మీడియా వేదికగా వీరు తమ విడాకులను ప్రకటించారు. వీరిరువురు విడిపోకుండా కలిసి జీవితాన్ని కొనసాగించాలని చాలా మంది అక్కినేని అభిమానులు, సినీ లవర్స్ కోరుకున్నారు. కానీ, వీరిరువురు విడిపోయి ఎవరి జీవితంలో వారు ఫుల్ బిజీ అయిపోయారు.

 

తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్..నాగచైతన్య-సమంతల కాపురం, విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి మురళీ మోహన్..తన కుమారుడు, కుటుంబం కోసం హైదరాబాద్ లో రెండు ఇళ్లు నిర్మించుకున్నాడు. ఓ రోజు మురళీ మోహన్ ఇంటికి వెళ్లిన నాగచైతన్య..ఆ ఇల్లు చూసి తనకు ఫ్లాట్ బాగా నచ్చిందని చెప్తూ..తనకు ఒక ఫ్లాట్ ఇవ్వాలని అడిగాడట.

నాగచైతన్య కోరికను తాను తిరస్కరించానని, తన కుటుంబం కోసం కట్టుకున్న తన ఇల్లు ఇంకొకరికి ఇచ్చే ఆలోచన లేదని చెప్పాడు. అయితే, నాగచైతన్య తన తండ్రి నాగార్జున చేత ఫోన్ చేయించి ఎలాగో అలాగా మురళీ మోహన్ ను ఒప్పించాడు. అలా ఆ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ లో తాను ఉండగా, పై ఫ్లోర్ లో సమంత-నాగచైతన్యలు ఉన్నారని మురళీ మోహన్ వివరించారు. ఆ ఇంట్లో చిన్న శబ్దం అయినా తను వినబడేలా ఫ్లాట్ ఉండేదని తెలిపారు.

మ్యారేజ్ తర్వాత నాగచైతన్య-సమంత..అలా తన ఇంటిలోని ఓ ఫ్లాట్ లో కాపురం పెట్టారని, చాలా అన్యోన్యయంగా సంసారం చేశారని తెలిపారు. జనరల్ గా హీరో, హీరోయిన్స్ అంటే తమ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటుంటారని, కానీ, ఏనాడు వీళ్లు పార్టీలు చేసుకోలేదని వివరించాడు. ప్రతీ రోజు సమంత ఉదయం..జిమ్ లో వ్యాయామం చేసేదని అన్నాడు.

వాళ్లిద్దరి మధ్య పొరపత్యాలు ఉన్నట్లు తనకు తెలియలేదని, ఓ రోజు పనిమనిషి వారిద్దరు విడిపోయారని, నాగచైతన్య ఫ్లాట్ ఖాళీ చేశాడని చెప్పిందని గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం తనకు ముందే తెలిస్తే నాగార్జునతో మాట్లాడేవాడినని తెలిపాడు మురళీ మోహన్. కలిసి మెలిసి ఉండే వారు డైవోర్స్ ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కాలేదని, తెలియదని చెప్పుకొచ్చారు మురళీ మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news