అల్లు అర్జున్‌ పై నాగబాబు సంచలన పోస్ట్‌..పరాయివాడేనంటూ ?

-

మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం చేసిన తర్వాత నాగబాబు సంచలన పోస్టు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

Nagababu’s sensational post on Allu Arjun

అయితే ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి చేశారు అని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కొంత మందేమో టిడిపి పిఠాపురం ఇన్చార్జి వర్మ గురించి నాగబాబు ఇలా మాట్లాడడానికి… మరికొంతమంది అల్లు అర్జున్ గురించి నాగబాబు ఇలా స్పందించాడని అంటున్నారు.

అయితే పిఠాపురంలో వర్మ… వైసీపీకి సపోర్ట్ గా సైలెంట్ గా ఓటర్లను డైవర్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మొన్న నంద్యాల వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. ఈ రెండు అంశాలను ఉద్దేశించి నాగబాబు ఇలా ట్విట్ చేసి ఉంటాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version