నయా ట్రెండ్..ఐటెమ్ గాళ్స్‌గా హీరోయిన్స్..

-

కమర్షియల్ సినిమా ఫార్ములాలో కంపల్సరీగా ఐటెమ్ సాంగ్ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్రాల్లో ఈ ఫార్ములా చాలా వరకు దర్శకులు ఫాలో అవుతుంటారు కూడా. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, ముమైత్ ఖాన్, సన్నీలియోన్, రాయ్ లక్ష్మి..ఇలా కొంత మంది తారలు సెపరేట్ గా స్పెషల్ సాంగ్స్ చేయడానికే ఉన్నారు. వీరిని ఆయా సినిమాల్లో దర్శకులు స్పెషల్ సాంగ్స్ కోసం సంప్రదించేవారు.

ఈ స్పెషల్ సాంగ్స్ తో సినిమాకు మాస్ మసాలా యాడ్ అవడంతో పాటు ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతారనేది దర్శకుల భావన. అందుకే వీరితో స్పెషల్ సాంగ్స్ చేయిస్తుంటారు. అయితే, ఇదంతా ఒకప్పుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు హీరోయిన్సే స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఐటెమ్ గాళ్స్ అయిపోతున్నారు. ఒక్కొక్కరుగా అందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతుండటం గమనార్హం.

స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెప్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే గతంలో ‘జిగేలు రాణి’గా అలరించింది. ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ చేయబోతున్నది. పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’ లో స్పెషల్ సాంగ్ చేసింది.

 

యంగ్ హీారోయిన్ రెజీనా కసాండ్రా ‘ఆచార్య’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి ‘సానా కష్టపడింది’. బీ టౌన్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు మూవీ ‘బ్లాక్ రోజ్’లో స్పెషల్ సాంగ్ చేసింది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటికే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇటీవల విడుదలైన ‘గని’ చిత్రంతో ‘కొడితే’ అనే సాంగ్ చేసింది.ఇలా హీరోయిన్స్ ఒక్కొక్కరుగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇలా చేయడానికి వారు భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news