Big Boss OTT Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ ఆమెనే..తప్పుకున్న ఆ కంటెస్టెంట్స్?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT నాన్ స్టాప్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. ప్రజెంట్ హౌజ్ లో ఏడుగురు సభ్యులే ఉన్నారు. గ్రాండ్ ఫినాలేలో ఎవరు మిగిలారు? ఎవరు ఫైనల్ విన్నర్ గా నిలుస్తారు? అనే విషయమై బీ బీలవర్స్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

ఓటింగ్ అనేది చివరి నిమిషాల్లో కీలకం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. టైటిల్ విన్నింగ్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? అని చర్చించుకుంటున్నారు. కాగా, తాజాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్, లీక్స్ ప్రకారం.. బిందు మాధవి ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ టైటిల్ విన్నర్ గా నిలిచిందట.

‘బిగ్‌బాస్‌’ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అమ్మాయి టైటిల్ విన్నర్ అవడం ఇదే కాగా, ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో బిందు మాధవి హల్ చల్ చేస్తోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్‌ ఏడో స్థానంలో ఉండగా, అనిల్ ఆరో స్థానంలో నిలిచారట. ఇక మిత్రా శర్మ , అరియానా గ్లోరీ, శివ వరుసగా తర్వాత మూడు స్థానాల్లో ఉన్నారని టాక్.

ఇక కంటెస్టెంట్స్ లో కొందరికి నాగార్జున మనీ ఆఫర్ చేయగా, వారిలో వీరు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరియానా గ్లోరీ రూ.10 లక్షల బ్రీఫ్‌ కేసును తీసుకొని టైటిల్‌ రేసు నుంచి తప్పుకుందట. అలా చివరి వరకు బిందు మాధవికి, అఖిల్‌కి మధ్య టఫ్ ఫైట్ జరగగా, చివరికి బిందు మాధవి టైటిల్ గెలుచుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే బీబీ లవర్స్ బిందు మాధవికి శుభాకాంక్షలు చెప్తున్నారు కూడా. కాగా, ఈ విషయమై ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news