Chiranjeevi: మెగా ప్లాన్..వీవీ వినాయక్‌తో చిరంజీవి హ్యట్రిక్ ఫిల్మ్!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై..అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ పిక్చర్ ఉంటుందని సినీ పరిశీలకులు అంటున్నారు. కాగా, ఈ సినిమా ఫలింతం నేపథ్యంలోనే చిరు..నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వరుసగా ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూనే..వెంకీ కుడుముల సబ్జెక్ట్ పైన కూడా రీ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం. తన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలపైన దర్శకులు కాన్సంట్రేట్ చేయాలని చిరంజీవి ఈ సినిమాల దర్శకులందరికీ సూచనలు ఇచ్చినట్లు వినికిడి.

ఈ క్రమంలోనే తనకు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నారట మెగాస్టార్. ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు చిరంజీవితో తీసిన వీవీ వినాయక్..ఈ సారి ముచ్చటగా మూడో సారి హ్యట్రిక్ ఫిల్మ్ ‘మాస్ మసాలా’తో ఒరిజినల్ స్టోరితో తీయాలని అభిమానులు సూచిస్తున్నారు.

వినాయక్ ఇప్పటి వరకు తీసిన రెండు సినిమాలు రీమేక్స్ కాగా, ఈ సారి ఒరిజినల్ స్టోరితో చేస్తే అదిరిపోతుందని అంటున్నారు. చిరంజీవితో ఎలాంటి సినిమా తీయాలని విషయమై డైరెక్టర్ వినాయక్ కు స్పష్టంగా తెలుసని చిరంజీవి నిర్మాతలతో చెప్పారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news