ప్రభాస్‌కు ఇష్టమైన కృష్ణంరాజు పాట ఇదే..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రజెంట్ ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-కె’ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి అవగానే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీ ప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తన 25వ సినిమా ‘స్పిరిట్’ చేయనున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే..ప్రభాస్ తన తండ్రి, పెదనాన్న వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు.

ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాత కాగా, పెదనాన్న కృష్ణంరాజు ప్రముఖ సినీ నటుడు. రెబల్ స్టార్ గా పేరు గాంచిన కృష్ణం రాజు తెలుగు చిత్రసీమ ప్రముఖుడిగా తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. తన పెదనాన్న కృష్ణం రాజు నటించిన సినిమాల్లోని పాటల్లో ‘త్రిశూలం’ చిత్రంలోని ఒక పాట అంటే చాలా ఇష్టమట. ఆ సాంగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

rebel star krishnam raju
rebel star krishnam raju

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిశూలం’ చిత్రంలోని ‘రాయిని ఆడది చేసిన రాముడివ’ పాట అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం. ఈ విషయం కృష్ణంరాజు భార్య తెలిపారు.

కే.వీ.మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఆత్రేయ లిరిక్స్ అందించారు. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ గా వచ్చిన ‘త్రిశూలం’లో కృష్ణం రాజు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ప్రజలకు బాగా నచ్చింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది..

ప్రభాస్ ప్రస్తుతం తన సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన గత చిత్రం ‘రాధే శ్యామ్’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. లవ్ స్టోరి గా వచ్చిన ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news