గోపీచంద్ సినిమాతో ‘ప్రేమ దేశం’ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ!!

-

‘ప్రేమ దేశం’ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోలుగా అబ్బాస్, వినీత్ నటించగా, హీరయిన్ గా టబు నటించింది. ఈ పిక్చర్ కు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. పాటలు ఇప్పటికీ ఫుల్ ఫేమస్.

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ ఇతర అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఈ ఫిల్మ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్..ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే, కొద్ది రోజుల వరకు అబ్బాస్ కు అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అతని కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది. దాంతో ఆయన వేరే రంగంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇన్నేళ్లకు అబ్బాస్..తెలుగు ఫిల్మ్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అబ్బాస్ ఆ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారట. శ్రీవాస్ దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా వచ్చే సినిమా కోసం అబ్బాస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అబ్బాస్ ఈ ఫిల్మ్ లో యాక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వినికిడి. అయితే, ఈ విషయమై అధికారిక సమచారం అయితే లేదు. చూడాలి మరి..ఈ వార్తల్లో నిజం ఎంతుందో..

Read more RELATED
Recommended to you

Latest news