మెగా ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్…!

-

మూడేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా ఆటో జానీ ఉంటుంది అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకేక్కిస్తారు అనే వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో తెలియదు గాని ఆ సినిమా ఆగిపోయింది. మహేష్ 150 సినిమాను తాను తెరకేక్కించాలి అనుకున్న పూరి ఆశలు ఆవిరైపోయాయి. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా చేసారు చిరంజీవి.

తాజాగా పూరి జగన్నాథ్ చిరంజీవి తో సినిమా చేసే కోరికను బయటపెట్టాడు. ఒకసారి కాదు రెండు సార్లు నాలుగుసార్లు త‌న‌కు చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోయింద‌ని, రెండుసార్లు పూజా కార్య‌క్ర‌మాలు కూడా అయిపోయిన త‌ర్వాత చిరంజీవి సినిమా ఆగిపోయింద‌ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు మాత్రం పూరి చిరంజీవి సినిమాను వదిలేది లేదు, సినిమా చేస్తాను అంటున్నాడు.

ఆటో జానీ కథ రెండో భాగం గురించి అప్పట్లో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కథకు మెరుగులు దిద్దాలని భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఊపులో ఉన్న పూరి త్వరలో చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. నిర్మాతగా దిల్ రాజు ఉండే అవకాశం ఉందని సమాచారం. విజయ్ దేవరకొండతో సినిమా పూర్తి కాగానే చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news