శంకర్‌తో సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు.. కారణమిదే..!

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ .. వెండితెరపైన చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జెంటిల్ మెన్’ నుంచి మొదలుకుని ఆయన ప్రతీ చిత్రం గ్రాండియర్ గానూ, సొసైటీని ఆలోచింపజేసే విధంగానూ ఉంటూనే.. కమర్షియల్ గా సక్సెస్ అవుతుంటుంది. అటువంటి శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలని హీరో, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ అనుకుంటుంటారు. కాగా, ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే నో చెప్పేశాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్.. ప్రస్తుతం RC 15 ఫిల్మ్ చేస్తున్నాడు. విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘భారతీయుడు-2’ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తి కాగా మధ్యలో జరిగిన క్రేన్ ప్రమాదం, నిర్మాతలతో విభేదాల కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రాగా తిరస్కరించాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్నేహితుడు’ సినిమాలో హీరోగా మహేశ్ బాబు కు తొలుత అవకాశం వచ్చింది. ఆ టైమ్ లో మహేశ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో జరిగిన ఎక్స్ పీరియెన్స్, సీన్స్ వస్తున్న విధానం చూసి మహేశ్ చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అలా ఒక రోజున తనకు శంకర్ సినిమా ఆఫర్ వచ్చిందని శ్రీనువైట్లకు మహేశ్ చెప్పాడట.

ఆ తర్వాత కొద్ది రోజులకు తాను శంకర్ మూవీ చేయడం లేదని దర్శకుడు శ్రీను వైట్లకు చెప్పేశాడట. అందుకు కారణం బహుశా ‘స్నేహితుడు’ సినిమాలో ఆ పాత్రలో తాను సరిపోనని అనుకున్నాడో ఏమో తెలియదు. శంకర్ ‘స్నేహితుడు’ సినిమా..బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ రీమేక్. ఇందులో హీరోగా తలపతి విజయ్ నటించాడు. తెలుగులోనూ ఈ సినిమా విడుదలైన ఘన విజయం సాధించింది. అలా శంకర్ సినిమాకు మహేశ్ నో చెప్పేశాడు. భవిష్యత్తులో అయినా శంకర్ దర్శకత్వంలో మహేశ్ చేస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news