Big Boss Non Stop: బిందు మాధవికి ప్రముఖ నటి మద్దతు..ఆడపులిదే టైటిల్ అని జోస్యం

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ పదకొండో వారంలోకి ఎంటరయింది. ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. గతవారం నటరాజ్ మాస్టర్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే గేమ్ మరింత రసవత్తరంగా మారింది.

ఇప్పుడు హౌజ్ లో ఉన్న వాళ్లు గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ‘బిగ్ బాస్’ ఇవ్వబోయే టాస్కులన్నిటినీ జాగ్రత్తగా ఆడాలని డిసైడ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్స్ కు ఈ లాస్ట్ వీక్ లో ఆడియన్స్ నుంచి వచ్చే ఓటింగ్ చాలా కీలకంగా మారనుంది.

ఇప్పటి వరకు ఓటింగ్ లో బిందు మాధవి సత్తా చాటింది. అఖిల్, మిత్రా శర్మ తదితరులు కొద్ది వారాలుంగా ఓటింగ్ లో ఇంప్రూవ్ అవుతున్నారు. కానీ, కన్సిస్టెంట్ గా ఓటింగ్ పర్సంటేజీని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది బిందు మాధవి. ఈ క్రమంలోనే బిందు మాధవికి ఓటు పడేలా
ప్రముఖ నటి మద్దతు తెలిపింది. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘‘ఆడపులి..బిందు మాధవి’’ అని కాంప్లిమెంట్ ఇచ్చింది.

తాజాగా ట్విట్టర్ వేదికగా బిందు మాధవికి మద్దతుగా ట్వీట్ చేసింది. ఫైనల్ వీక్ లోకి ఎంటరయిన తన ఆడపులి బిందు మాధవికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. డెఫినెట్ గా విన్నర్ ఆమెనే అని జోస్యం చెప్పింది. ప్రతీ ఒక్కరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో లాగిన్ అయి తమ పది ఓట్లను బిందు మాధవికి వేయాలని విజ్ఞప్తి చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.. వరలక్ష్మి ప్రస్తుతం ‘NBK 107’లో కీలక పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news