ట్రెండ్ ఇన్: దిల్ రాజు మేల్కోవాలంటున్న ఆ హీరో అభిమానులు.. ఎందుకంటే?

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. నిర్మాతగా దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ప్రస్తుతం..మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. దిల్ రాజును నెటిజన్లు, ఓ స్టార్ హీరో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్ రాజు …తన 50 వసినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో తీస్తున్న సంగతి అందరికీ విదితమే. 2021 సెప్టెంబర్ 8న ఆ సినిమా RC 15 పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది కూడా.

ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపైన మెగా అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు మేకర్స్ ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు.

ఈ సినిమాలో నటీ నటులకు సంబంధించిన పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. కానీ, ఈ పిక్చర్ నుంచి అఫీషియల్ గా ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. దాంతో అభిమానులు, నెటిజన్లు ..దిల్ రాజుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘WAKE UP DILRAJU వేక్ అప్ దిల్ రాజు’ అనే వర్డ్ తో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు. అలా వరుస ట్వీట్లతో దిల్ రాజు పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. దిల్ రాజు మేల్కొని ఆర్సీ 15 అప్ డేట్ ఇవ్వాలని కోరుతూ రకరకాల మీమ్స్ ట్వీట్ చేస్తున్నారు.

WE WANT RC 15 UPDATE… అని నెటిజన్లు, మెగా అభిమానులు డిమాండ్ చేస్తు్న్నారు. దిల్ రాజు సంస్థ ఎస్వీసీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆర్సీ 15 సినిమా అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ పిక్చర్ కు కార్తిక్ సుబ్బరాజు స్టోరి అందించగా, ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news