మంగళసూత్రానికి పిన్నీసులను వేసుకొంటే ఏమౌతుందో తెలుసా?

-

పెళ్ళైన మహిళలకు మంగళ సూత్రం చాలా ముఖ్యమైంది..అయితే ఈ మంగళసూత్రం విషయం లో మహిళలు ఎప్పుడు పొరపాట్లు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు..అంతేకాకుండా మంగళసూత్రాన్ని ఎవరికీ కనిపించకుండా ధరించాలి అని చెబుతూ ఉంటారు. మంగళం అంటే శుభప్రదం. సూత్రం అంటే తాడు. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం. అందుకే పెళ్లి అయినా ప్రతి ఒక వివాహితకు అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. పెళ్లయిన వివాహేతకు మెడలో తాళిబొట్టు లేకపోతే మెడ అంతా కూడా బోసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది..

పెళ్లినాటి నుంచి మహిళలు మంగళసూత్రం ధరించడం మన దేశ సాంప్రదాయం..ఈ ఆచారం ఇప్పటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. వేదమంత్రాల సాక్షిగా బంధాన్ని ముడివేసే ఈ దారం భార్యభర్త అనుబంధానికి ప్రతీక. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముడ్లు వేయిస్తారు పండితులు.. అంటే భర్త ఆయుష్షు మొత్తం ఆ తాడులో ఉందని చెబుతారు..

ఇకపోతే పసుపు కుంకుమలు సౌభాగ్యానికి ప్రతీకలు మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. నిత్యం తాడుకి పసుపురాసుకోవడం, సూత్రాలకు కుంకుమ పెట్టుకోవడం చాలా మంచిది. చాలామంది మంగళసూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్నచిన్న ప్రతిమలు పెట్టించుకుంటారు. అవి ఫ్యాషన్ కోసం చేస్తారు కానీ అలా చేయకూడదంటారు పండితులు. అలాగే మంగళ సూత్రానికి ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండేలా చూడాలి. ముఖ్యంగా చాలామంది స్త్రీలు మంగళ సూత్రాలకు పిన్నీసులు పెడతారు.. అలా ఇనుము అస్సలు పెట్టకూడదు అని నిపుణులు చెబుతున్నారు.. ఇనుము వల్ల భర్తకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news