వాస్తు: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయా? అయితే ఇలా వెయ్యండి..

-

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే ఎప్పుడో ఒకసారి రావడం ఒకే కానీ ఇలా నిత్యం జరిగితే మాత్రం కొన్ని దోష నివారణ పూజలు చెయ్యడం చెయ్యాలి..కుటుంబ సామరస్యాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాస్తు శాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడిటీలు పనికొస్తాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ల కోసమే ఇది. భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్లు అధికం.

గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..?

*. ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలు అవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
*. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కళ్లుప్పుని వేసి నెల రోజుల పాటూ వదిలేయండి. ఒక నెల తరువాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి.
*. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
*. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లల్లో ఇతని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది.
*. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగితే మాత్రం ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం మానెయ్యాలి..అవి మనసును కోపంగా మారుస్తాయి.కుటుంబంలోని మగవారి మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది. విబేధాలు తగ్గిస్తుంది…ఇంట్లో తెలుపు రంగు వస్తువులను ఉంచడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news