కేసీఆర్ చేసిన పాపాలకే కరువు వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ పాపాలకే రాష్ట్రంలో  కరువు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అంటున్నారు. తెలంగాణలో రైతులు ఉన్నందుకు గుర్తుకొచ్చింది. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా..? అని ప్రశ్నించారు. వానాకాలంలో అధికారంలో ఉన్నదే కేసీఆర్.. కేసీఆర్ చేసిన పాపాల వల్లనే కరువు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ చేసిన పాపాలు పిల్లలకు తగిలి జైలుకు వెళ్లారు. తాము చలికాలంలో అధికారంలోకి వచ్చాం.. చలికాలంలో వర్షం వస్తుందా..? అని ప్రశ్నించారు. రూ.4లక్షల చిల్లర మాత్రమే. కేసీఆర్ వారసత్వంగా కరువు, అప్పులు వచ్చాయి. మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు..? కరువు తెచ్చింది ఎప్పుడు..? అని ప్రశ్నించారు. సూర్యపేటలో కరెంట్ పోయింది అని సెటైర్లు వేశారు. వాస్తవానికి సూర్యపేటలో కరెంట్ పోలేదు.. జనరేటర్ పొరపాటు వల్లనే కరెంట్ పోయిందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news