ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఇది వింటే గుండెపోటు ఖాయం..

-

ఇప్పుడు అంతా స్మార్ట్ మయం అయిపోయింది.స్మార్ట్ ఫోన్ లను వాడేవాళ్ళు ఖచ్చితంగా హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడని వారు లేరంటే నమ్మలేం. 90 శాతం మంది లైఫ్‌లో ఇవి భాగమైపోయాయి. అవి పెట్టుకుని ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో ఇష్టమైన మ్యూజిక్ ఎంజాయ్ చేయడం యూత్‌కి అలవాటైపోయింది.. అసలు ఏ పని చేస్తున్నా.. ఇవి మాత్రం ఉండాల్సిందే.. లేదంటే చేసే పని కూడా స్లో అయిపోతుంది.

ఎక్కువ సౌండ్ పెట్టుకుంటేనే కిక్ వస్తుందని యూత్ పీలింగ్. కానీ, వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు, యువత లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధ్యయన నివేదిక బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో దీని గురించి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సురక్షితంకాని హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వినియోగంపై అమెరికాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్‌, పిల్లల్లో 75 డీబీ శబ్దం మించకూడదు. కానీ, ప్రస్తుతం శ్రవణ పరికరాలు వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్‌ శబ్దాన్ని వింటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో వినికిడి సమస్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్లు పెరగడం తో హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ వంటి వాటితో మ్యూజిక్ వినడంతో పాటు భారీ శబ్దాలుండే మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరు కావడం వల్ల కూడా వినికిడి శక్తీ పూర్తిగా పోతుందని నిపుణులు అంటున్నారు… చూశారుగా హెడ్ ఫోన్స్ కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news