ఛీ..ఛీ..ఆఖరికి దేవుడిని కూడా వదలరా..

-

ముక్కోటి దేవతలకు అధిపతి అంటే మహా శివుడి పేరు వినిపిస్తోంది.ఆయన ఎంత శాంతంగా భక్తుల కోరికలను తీరుస్తారో..అంతకు మించి కోపం వస్తే ఆగడు..ఆయన ఆజ్ఞ లేనిదే గాలి కూడా వీచదు అని పెద్దలు అంటారు. మన హిందూ సనాతన ధర్మంలో శివుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో ఒకరు.. లయకారుడు. జలం తో అభిషేకించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు..హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలం నుంచి పూజలను అందుకుంటున్నాడు.

ప్రపంచ దేశాల్లో శివలింగాలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి..శివుడికి భక్తులు కూడా ఎక్కువే.. అందుకే సోమవారాల్లో శివాలయాలు భక్తుల తో రద్దీగా ఉంటాయి.వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్న శివయ్య ను భక్తులు అత్యంత భక్తశ్రద్ధలతో పూజిస్తారు. అయితే అటువంటి శివయ్యకు అవనమానం జరిగిందని శివ భక్తులు మండిపడుతున్నారు..

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వేలుపుల అనేక శివ లింగాలు, ఇతర దేవతలున్నారు. అయితే శివలింగానికి కొందరు వైసీపీ కార్యకర్తలు తాళ్లు కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఆలయం సమీపంలో రెడీ అయ్యారు. తాళ్లను శివలింగానికి మూడేసి కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో సంబందించిన కార్యకర్తల పై శివ భక్తులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.. ఆలయం వద్ద వైయస్సార్ చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news