ఎన్నికలొస్తే..ఈ ఆలయాలకు నాయకులు క్యూ కడతారు..!!

-

ఒక్కో సీజన్‌ ఒక్కో దేవుడికి ఫేమస్ ఉంటుంది. కార్తీకమాసంలో శివుడు..శ్రావణమాసంలో లక్ష్మీదేవి ఇలా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా.. ఎన్నికల టైమ్‌లో కొన్ని ఆలయాలకు వెళ్తారు. ప్రతి నాయకుడు తన విజయాన్ని కాంక్షిస్తూ దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలకు చేరుకొని పూజించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేశంలోని ప్రముఖ దేవాలయాల గురించి.. ఈ ఆలయంలో పూజలు చేస్తే.. నాయకుడికి విజయం తధ్యమని నమ్మకం బలంగా ఉంటుంది.

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి ఆలయం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం రాంలాలా ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి పూజించిన వ్యక్తికి శ్రీరాముని సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఎన్నికల వేళ చిన్నా పెద్దా నాయకులంతా ఇక్కడికి భారీ సంఖ్యలో వస్తారు.

మా వింధ్యవాసిని, మీర్జాపూర్

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఉన్న వింధ్యవాసిని అమ్మవారి ఆలయంలోని సిద్ధపీఠం అన్ని కోరికలను తీర్చేదిగా పరిగణించబడుతుంది. వింధ్యవాసిని ఆస్థానానికి ఎవరు వచ్చి పూజలు చేస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడి వారి నమ్మకం.. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో నేతలు ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. త్రికోణ యంత్రంపై ఉన్న ఈ ఆలయం ఒక శక్తిపీఠంగా భక్తులు భావిస్తారు.

కామాఖ్య దేవాలయం అస్సాం

అస్సాంలోని నీలాంచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధ దేవాలయంగా పరిగణించబడుతుంది. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ ఆలయానికి వెళ్ళితే తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం. అమ్మవారి దర్శనం చేసుకుని తంత్ర-మంత్రం ద్వారా కోరికలను నెరవేరుతాయని ప్రసిద్ధి.. ఎన్నికల సమయంలో చాలా మంది పెద్ద, ప్రముఖ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలను చేస్తారు. అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన ఏ భక్తుడు ఖాళీ చేతులతో వెళ్లరని నమ్మకం..

ఉజ్జయిని మహాకాల్ ఆలయం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలోని మహాకాల్ దేవాలయం ఉంటుంది. అన్ని కష్టాలను తొలగించి… కోరికలు తీరుస్తుందని అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకరైన లయకారుడు శివయ్య దక్షిణ ముఖంగా శివలింగం స్థాపించబడింది. శ్రీ మహాకాళేశ్వరుడుని నిండుహృదయంతో ఆరాధించే భక్తుడు.. పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. ప్రధానమంత్రి నుండి సెంట్రీ వరకు శ్రీ మహాకాళేశ్వరుడుని పూజించడానికి ఇది కారణం. కామాఖ్య దేవాలయం వలె, మహాకాల్ నగరం కూడా తంత్ర-మంత్ర సాధన కోసం చాలా పవిత్రమైనది.

Read more RELATED
Recommended to you

Latest news