IRCTC నుండి వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్.. ప్రేమికులారా మరి ఈ టూర్ వివరాలని చూసేయండి..!

-

ఈ వాలెంటైన్స్ డే ని స్పెషల్ గా జరుపుకోవాలని చూస్తున్నారా..? ప్రేమికులారా మరి ఈ టూర్ వివరాలని చూసేయండి. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే చాలా రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల తో ఎంచక్కా నచ్చిన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్ ని ఐఆర్‌సీటీసీ తీసుకు వచ్చింది. పూర్తి వివరాలని చూస్తే.. ఇది కోల్‌కతా నుంచి అందుబాటులో ఉంటుంది.

బ్యాంకాక్, పట్టాయా లాంటి ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫిబ్రవరి 11న ఈ టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. ఫ్లైట్‌లో థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లి అక్కడి టూరిస్ట్ స్పాట్స్ ని చూపిస్తారు. ఇక ఈ టూర్ ఎలా మొదలవుతుందనేది చూస్తే.. థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు కోల్‌కతాలో స్టార్ట్ అవుతుంది. టూరిస్ట్ గైడ్ పర్యాటకుల్ని పట్టాయా తీసుకు వెళ్తారు.

పట్టాయాలో హోటల్‌లో చెకిన్ అవ్వాలి. సాయంత్రం అల్కజార్ షో లేదా టిఫానీ షో ఉంటుంది. డిన్నర్ తర్వాత రాత్రికి పట్టాయాలో స్తే చేసి.. మూడో రోజు పట్టాయా లోకల్ టూర్ వేసేయచ్చు. కోరల్ ఐల్యాండ్ చూడచ్చు. సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్ చేసేయచ్చు. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ కి వెళ్లాలి. రివర్ క్రూజ్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఆ తరవాత బ్యాంకాక్‌లోనే స్టే చేయాలి. ఐదో రోజు బ్యాంకాక్ టూర్. సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ చూసి వచ్చేయచ్చు. అర్ధరాత్రి 2.55 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటలకు కోల్‌కతా రీచ్ అవ్వచ్చు. టూర్ ముగుస్తుంది. ఇక ధరల విషయానికి వస్తే.. డబుల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.48,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,364 చెల్లించాలి. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news