12న రణస్థలంలో యువశక్తి సభ : పవన్‌ కల్యాణ్‌

-

ఏపీలో విపక్ష టీడీపీ యువగళం వినిపిస్తుండగా.. ఇప్పుడు ఆ పార్టీకి మిత్రుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా యూత్ పేరుతో ఓ సభ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో ఈ నెల 12న జనసేన తరఫున యువశక్తి సభ నిర్వహించేందుకు పవన్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల చేశారు. రాష్ట్రంలోని యువ గళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. యువతీయువకులందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని పవన్ పిలుపునిచ్చారు. భారతదేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని అన్నారు. అయితే ఉత్తరాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో, వలసలు, విద్యా, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభ ఉంటుందని పవన్ కల్యాణ్ వివరించారు. అయితే ఈ సభలో తాము మాట్లాడడం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే వినే కార్యక్రమం చేబడుతున్నామని తెలిపారు. కాగా, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news