అక్కడ 283 సింహాలు చనిపోయాయి.

-

గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ అడవుల్లో 2020-2021 మధ్యలో 283 ఆసియా సింహాలు చనిపోయాయి. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు ఆ రాష్ట్ర ప్రభుత్వం.

గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు విక్రమ్ భాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు తెలియజేశారు.
గిర్ అడవుల్లో ప్రస్తుతం  206 మగ సింహాలు, 309 ఆడ సింహాలు , 29 సింహాపు పిల్లలు ఉన్నాయి. 2020 నుంచి 2021 చివరి వరకు 254 సింహాలు సాధారణంగా మరణించిగా , 29 సింహాలు పలు ప్రమాదాల్లో మృతి చెందాయి అని పేర్కొన్నారు.
గిర్ అడవుల్లో ఉన్న ఆసియా సింహాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందని ప్రభుత్వం సభా ముఖంగా తెలియజేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news