Breaking : హైదరాబాద్‌లో 69 మంది సీఐలు బదిలీ

-

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో బుధవారం భారీగా సీఐల బ‌దిలీలు జ‌రిగాయి. ఎన్న‌డూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐల‌ను బ‌దిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కీల‌క పోలీసు స్టేష‌న్ల‌లో ప‌ని చేస్తున్న సీఐలను కూడా బ‌దిలీ చేశారు. అయితే.. పంజాగుట్ట ఎస్‌హెచ్‌వో బదిలీ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 10రోజుల క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిన హరిచంద్రారెడ్డిని తిరిగి పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా నియమించారు.

Hyderabad: CP CV Anand puts in riders to ring in New Year

ప్రస్తుతం పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఉన్న నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. నారాయణగూడ ఎస్‌హెచ్‌వోగా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌ కె.సత్తయ్య, బేగంబజార్‌ ఎన్‌.శంకర్‌, శాలిబండ జి.కిషన్‌, మొగల్పుర శివకుమార్‌, ఆసిఫ్‌నగర్‌ శ్రీనివాస్‌, హబీబ్‌నగర్‌ శ్రీరామ్‌ సైదాబాబు, రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌వోగా జి.లింగేశ్వరరావు నియమిస్తూ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం పోలీసు కానిస్టేబుల్ బ‌దిలీలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news