ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలి : ప్రధాని మోడీ

-

ఆంధ్రప్రదేశ్ లో మార్పు రావాలి.. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కలికిరిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. మాఫియాకు వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాఫియాకు పక్కా చికిత్స చేస్తుందని తెలిపారు ప్రధాని. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.

దేశాన్ని రివర్స్ గేర్ లో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 370 ఆర్టికల్ ను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడే వ్యక్తి మాటలు వింటే నాకు సిగ్గేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని.. ఈ వ్యాఖ్యలను తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు స్వీకరిస్తారా..? అని ప్రశ్నించారు. దేశ విభజనకు కాంగ్రెస్ కారణం అన్నారు. తిరుపతి, రాజంపేట, కడప లోక్ సభ అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version