భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇలాంటి పనులు అస్సలు చెయ్యకూడదు.. మహాపపం..

-

మన దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు ఒక ప్రత్యేకత ఉంది..పూర్వకాలం నుండి ప్రజలు వీటిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది ఆచారాలను, సాంప్రదాయాలను గాలికి వదిలేస్తున్నారు.. సంప్రదాయలకు పెద్ద పీట వేస్తున్న స్త్రీల విషయంలో అది తప్పు అవుతుంది.వివాహం అయిన ప్రతి స్త్రీ మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. గర్భంతో ఉన్న తొమ్మిది నెలలు భార్య కోరిక మేరకు ఆమె కోరికలను తీర్చే బాధ్యత భర్తకి ఉంటుంది. ఇలా గర్భంతో ఉన్న భార్యని సంతోషంగా ఉంచటం వల్ల కడుపులో బిడ్డ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త సముద్ర స్నానం అస్సలు చెయ్యకూడదు..అంతే కాకుండా పచ్చటి చెట్లు కూడా నరకకూడదు. ఇలా ప్రాణం ప్రాణంతో ఉన్న పచ్చని చెట్లు నరకడం వల్ల పుట్టబోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భార్య గర్భంతో ఉన్న సమయంలో ఆమెకు ఆరు నెలలు నిండిన తర్వాత భర్త దాదాపు మూడు నెలల పాటు బిడ్డ పుట్టే వరకు కటింగ్ చేయించుకోవటం, షేవింగ్ చేసుకోవడం అంటే పనులు చేయరాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎవరైనా తెలిసిన వారు ,లేక బందువులు మరణిస్తే అక్కడికి వెళ్లి మరణించిన వారి పాడే కూడా పొరపాటున కూడా తాకకూడదు..

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త శవం ఉన్న ఇంటికి అస్సలు వెళ్ళకూడదు..అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎల్లప్పుడూ ఆమె వెంట తోడుగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా ఆ పనులను రద్దు చేసుకొని బిడ్డ పుట్టే వరకు భార్యకి తోడుగా ఉండాలి. ఎందుకంటే గర్భంతో ఉన్న సమయంలో స్త్రీ భర్తతోడును కోరుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు, పర్వతారోహణ, సముద్ర ప్రయాణం కూడా చేయకూడదు. అలాగే భార్య గర్భంతో ఉన్న సమయంలో గృహప్రవేశం తో పాటు అభిషేకం వంటి వాటిని కూడా చెయ్యరాదు.. ముఖ్యంగా గుడికి పోరాదు.. బిడ్డ పుట్టిన పదకొండు రోజులకు భర్త వెళ్లొచ్చు.. ఇలాంటి వాటిని భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త అస్సలు చెయ్యకూడదు..

Read more RELATED
Recommended to you

Latest news