కాంగ్రెస్ పార్టీకి షాక్.. మంత్రి జగదీష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

-

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
ఉమ్మడి నల్గొండ నుంచి ఫ్లోరోసిస్ ను కేసీఆర్ తరిమి వేశారని అన్నారు.2018 తర్వాత మునుగోడు లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఆ ఎమ్మెల్యే ఆరు నెలలకు కూడా ఒక్కసారి మునుగోడుకు వచ్చింది లేదని, కాంట్రాక్టులు,వ్యాపారాల్లో బిజీగా ఉండడడం వల్ల ఆ ఎమ్మెల్యేకు కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చే తీరిక లేదన్నారు.

అందుకే నేనే మునుగోడు కు రావాల్సి వచ్చింది …కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచాల్సి వచ్చిందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.నోరు ఇంత పెద్దగా చేసుకుని…నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడు లో మన అంతర్గత పొరపాట్ల వల్ల ఈ నియోజకవర్గాన్ని పోగొట్టుకున్నామని,ఉన్న పార్టీ నాయకులనే దూషించి …అవతలి పార్టీని పొగిడే ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేయాలేకనే టిఆర్ఎస్ పార్టీ లోకి వస్తున్నారని అన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news