టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారీన పడి మరణించారు. అయితే.. తాజాగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. నిన్న అర్ధరాత్రి మరణించారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. సుమారు 40 కి పైగా సినిమాలు, 10 కి పైగా సీరియల్స్‌ లో నటించారు. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ప్రేమకావాలి, లాంటి సినిమాల్లో నటించారు కొంచాడ శ్రీనివాస్‌.

ఇక కాంచాడ శ్రీనివాస్‌ కు తల్లి విజయ లక్ష్యి ఉన్నారు. తండ్రి ఐదు సంవత్సరాల క్రితం చనిపోగా… తమ్ముడు పదేళ్ల కిందట మృతి చెందారు. ఇక శ్రీనివాస్‌ మృతి చెందడంతో పలాస- కాశీబుగ్గ జంట పట్టణాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక శ్రీనివాస్‌ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news