సీఎం జగన్ పై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు.. మరో 10 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రి

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పై టాలీవుడ్‌ హీరో సుమన్‌ సంచలన వ్యాక్యలు చేశారు. సీఎం జగన్‌ మరో రెండు సార్లు ముఖ్యమంత్రి గా కొనసాగితే.. ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ గా మారిపోతుందని ఆయన వెల్లడించారు. మూడు దఫాలు ముఖ్యమంత్రి గా ఒకరే ఉండే లా ప్రజలు అవకాశం ఇస్తే.. అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

సోమవారం విజయవాడలోని జవహార్‌ ఆటో నగర్‌ లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిదని చెప్పారు.

సినిమా టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి తాము అంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్‌ సలహా ఇవ్వడంతోనే.. తాను ఈ రంగానికి వచ్చానని స్పష్టం చేశారు. అందుకే మెకానిక్‌ లంటే తనకు అభిమానని పేర్కొన్నారు. ఆటోనగర్‌ కు చెందిన అబ్దుల్‌ కలాం తన మంచి మిత్రుడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news