భారత్‌పై కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. లాక్ డౌన్‌తో ప్రమోజనం లేదు: ఎయిమ్స్ డైరెక్టర్

-

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులియా అన్నారు. వైరస్‌లో మార్పులే సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణమని ఆయన తెలిపారు. రెండు వారాల పాటు కఠినంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని గులియా పేర్కొన్నారు. కఠిన ఆంక్షలతో వైరస్‌ను కట్టడి చేయగమని ఆయన అభిప్రాయపడ్డారు. నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డౌన్లలతో ప్రయోజనం లేదని గులియా స్పష్టం చేశారు. దేశంలో

కాగా కరోనా రెండో వేవ్ వ్యాప్తి తీవ్రమైంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రులకు కరోనా రోగుల సంఖ్య ఎప్పుడు లేనంతగా పెరిగాయి. మరోవైపు ఆక్సిజన్ లేకపోవడంతో మృతులు విపరీతంగా పెరుగుతున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత ఇలా ఉందంటే.. మూడో వేవ్ ఇంకెంత భయంకరంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. వ్యాక్సిన్ పంపణీని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వాళ్లకు టీకా ఇస్తున్నారు. 18 ఏళ్ల దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version