Breaking : పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అజిత్‌ పవార్‌

-

మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) సీనియర్ నేత అజిత్ పవార్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పుణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన ఎక్కిన లిఫ్ట్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు సాంకేతిక సమస్యలతో నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. అయితే ఈ ఘటన నుంచి ఎలాంటి గాయాలు లేకుండా ఆయన సురక్షితంగా బయటపడగలిగారు. బారామతిలో తాను ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు అజిత్ పవార్ తెలిపారు. లిఫ్ట్ కింద పడిన సమయంలో తనతో పాటు ఒక డాక్టర్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని చెప్పారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.

ఈ విషయాన్ని ఇంట్లో తన భార్యకు, తల్లికి సైతం చెప్పలేదన్నారు. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదన్నారు. ఈ ఘటన జనవరి 14న జరిగినట్లు చెప్పారు. ఆ తర్వాత లిఫ్ట్ డోర్‌ను బద్దలుగొట్టడంతో తామంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు. ప్రమాదం విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు. లేదంటే నిన్ననే ఈ విషయం బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news