యాక్టర్ అలీకి జగన్ గుడ్ న్యూస్… రాజ్య సభ సీటు కేటాయించే అవకాశం..!

-

వైసీపీ నేత, యాక్టర్ అలీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రాజ్యసభ స్థానాల్లో అలీకి సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవారంలో మళ్లీ కలుద్దాం అని జగన్ అలీతో అన్నారు. త్వరలో రాజ్యసభలో నాలుగు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఒకటి మైనారిటీలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో అలీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసమే అలీని మళ్లీ కలుద్దాం అని జగన్ అన్న వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. రెండున్నరేళ్లుగా అలీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో సినీరంగం అంతా వైసీపీకి దూరంగా ఉంది. ఆ సమయంలో కూడా కొంత మంది నటులు వైసీపీకి మద్దతు పలికారు. అలీతో పాటు కమెడియన్ ప్రుథ్వీ, పోసాని వంటి వారు వైసీపీకి మద్దతు ఇచ్చారు. దీంతోనే వైసీపీ రాజ్యసభ సీటును అలీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news