ఏపీ వరద బాధితులకు అల్లు అర్జున్ విరాళం.

-

ఆంధ్ర ప్రదేశ్లో వరద బాధితులకు సెలబ్రెటీలు చేయూతనిస్తున్నారు. ఇటీవల అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలో ముఖ్యంగా నెల్లూర్, చిత్తూర్,కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఈనాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. చాాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా… ఉండటానికి నీడను కూడా కోల్పోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రజల ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు.

ఇంతటి వరదలు రావడంతో సెలబ్రెటీలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ వరద సాయం కోసం రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. ప్రజలంతా త్వరగా కోలుకోవాలని బన్నీ ఆకాంక్షించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, రామ్ చరన్ చెరో రూ. 25 లక్షల విరాళాలను అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు గీతాఆర్ట్స్ రూ. 10 లక్షలు అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news