అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగం – చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శంకుస్థాపనకు నేటితో సరిగా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదిక ద్వారా స్పందిస్తూ. “ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని  నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది.

 

అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడు. అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది…. అమరావతే గెలుస్తుంది… ఇదే ఫైనల్”. అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version