పోలవరం వద్ద నాడు-నేడు పేరిట ఫొటో గ్యాలరీ.. చంద్రబాబుకు అంబటి కౌంటర్‌

-

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరంలో నాడు- నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజక్టు 2019 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని ఫొటోల ద్వారా వివరించారు. పోలవరం స్పిల్ వే, కాంక్రీట్ డ్యామ్, అప్రోచ్ చానల్ పనుల పురోగతిపై వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిన్న అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబు చెప్పిన వివరాలు నమ్మొద్దని, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చానని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు.

గైడ్ బండ్ కుంగడం వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. గైడ్ బండ్ కుంగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గైడ్ బండ్ కు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయిస్తామని అంబటి పేర్కొన్నారు. స్పిల్ చానల్ దెబ్బతినకూడదనే, డిజైన్ లో లేకపోయినా గైడ్ బండ్ నిర్మించడం జరిగిందని వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version