మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి : మంత్రి అంబటి

-

మరోసారి టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్‌కి వైసీపీ అడ్డంకి అని చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారని, మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్లనే పోలవరం పూర్తి కాలేదని, ట్రాన్‌స్ట్రయ్ ను తీసి నవయుగకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది బాబు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం చూడను కూడా చూడదు చెత్త బుట్టలో వేస్తారని, పోలవరం కుంటు పడింది అని చెప్పాలని ఉద్దేశ్యంతో ఈ లెటర్ రాసారన్నారు.

పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని, పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్ వే, ఇతర పనులు పూర్తి చెయ్యలేదని, డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు, దేవినేని ఉమ వైఖరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతిందో కూడా చెప్పలేని పరిస్థితి అని, అసెంబ్లీలో పోలవరంపై చర్చ జరుపుదామని, శాసనసభ సాక్షిగా డయాఫ్రామ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చర్చిద్దామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో త్వరలోనే వైట్ పేపర్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version