‘మిషన్ తెలంగాణ’ షురూ.. ఈ నెల 28 న తెలంగాణకు అమిత్ షా

-

 

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా జాతీయ నాయకులు తెలంగాణకు వస్తున్నారు. ఇక తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 28 న తెలంగాణ కు అమిత్ షా రానున్నారు.

పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా ఆయన ఇక్కడికి రానున్నారు. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో సమావేశం కానున్న అమిత్ షా… పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ… దిశా నిర్దేశం చేయనున్నారు. సంఘ్ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది 5 సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా.. బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అటు ఈ నెల 19 న ప్రధాని మోడీ కూడా తెలంగాణకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news