వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తం: ఎమ్మెల్యే హరీశ్రావు

-

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . ఆయన వ్యాఖ్యలు -ఫిరాయింపులు ప్రోత్సహించేలా ఉన్నాయని హరీష్ రావు అన్నారు. జహీరాబాద్లో లోక్ సభ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఇక ఈ సమావేశానికి హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ ’25 మంది మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

కానీ వేరే పార్టీల శాసససభ సభ్యులను తాము చేర్చుకోం అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నరు అని గుర్తు చేశారు. ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని అన్నారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు అని,బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చాక వడ్డీతో సహా మీకు తిరిగిస్తం అని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం’ అని హరీష్ రావు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version