Breaking : ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల‌ షెడ్యూల్ విడుద‌ల

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ ఎస్ఎస్‌సీ బోర్డు విడుద‌ల చేసింది. కాగ గ‌తంలోనే షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌గా.. జేఈఈ మెయిన్స్, ఇంట‌ర్ పరీక్ష కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్ లో స్వ‌ల్ప మార్పులు చేసింది. దీంతో కొత్త షెడ్యూల్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్ర‌కారం ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

అలాగే మే 9 వ తేదీతో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ముగియ‌నున్నాయి. కాగ ఏప్రిల్ 27న తెలుగు ప‌రీక్ష ఉండ‌నుంది. అలాగే ఏప్రిల్ 28వ తేదీన సెకండ్ లాగ్వేంజ్, ఏప్రిల్ 29 వ తేదీన ఇంగ్లీష్ ప‌రీక్ష ఉండ‌నుంది. అలాగే మే 2 వ తేదీన గ‌ణితం, మే 4 వ తేదీన సైన్స్ పేప‌ర్ – 1, మే 5 వ తేదీన సైన్స్ పేప‌ర్ – 2 ఉండ‌నుంది. అలాగే మే 6 వ తేదీన సోషల్ ప‌రీక్ష ఉండ‌నుంది. కాగ ఏప్రిల్ 30 తో పాటు మే 1 తేదీల్లో సెల‌వు దినాలు గా ఉండ‌న్నాయి. అలాగే మే 3 రంజాన్ ఉండ‌టంతో సెలువు ఉండ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news