కాంగ్రెస్ లో చేరాక షర్మిల యాస, భాష మారాయి : సజ్జల

-

షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష మారాయి.. చనిపోయిన వైఎస్సార్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు.. రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ.

కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. సోనియాగాందీ చెబితేనే కేసు వేశానని శంకర్రావు చెప్పారు. ఆజాద్ కూడా జగన్ మాట విని ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. చంద్రబాబు డైలాగ్ లను షర్మిల ఇవాల మాట్లాడారని పేర్కొన్నారు. షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఏం చేశారు.. మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చారు. చంద్రబాబు అన్ని అస్త్రాలతో పాటు వైఎస్ఆర్ ఓట్లు చీల్చడానికి షర్మిలను ఏపీలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version