రుషికొండలో డ్రోన్‌లు…పవన్ కళ్యాణ్ పై కేసు పెడతాం : మంత్రి అమర్నాథ్

-

పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌పై ప్రభుత్వం మరోసారి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందని.., రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌లు ఎగురవేశారని ఫైర్‌ అయ్యారు. అనుమతి లేకుండా చేసిన పనికి పోలీస్ కేసు పెడతామని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి అమర్నాథ్.

ఇప్పటికే సెక్షన్ 30 ఉల్లంఘన కింద జనసేనకు పోలీసులు నోటీసు ఇచ్చారని వెల్లడించారు. జనసేనకు మంత్రి అమర్నాథ్ ఓపెన్ ఆఫర్.. విస్సన్నపేట భూముల వద్దకు పవన్ వెళ్లడానికి అభ్యంతరం లేదు, ఒక్క సెంటు భూమి నాకు ఉందని నిరూపిస్తే జనసేనకు రాసిచ్చేస్తా, అందుకు జనసేన సిద్ధమా? : అని సవాల్‌ విసిరారు మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version