జనసేనకు దశ, దిశ లేదు..అది అంగడిలో వస్తువు – అంబటి రాంబాబు

-

జనసేనకు దశ, దిశ లేదు..అది అంగడిలో వస్తువు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.జనసేన చంద్రబాబుకు మాత్రమే అమ్ముడుపోతుంది.. బాబు నాన్నకు బుడ్డి ఇస్తే.. జగన్ అమ్మ ఒడి ఇచ్చారని చురకలు అంటించారు. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే బాబు పొత్తుల ఎత్తులు అని.. జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా దించలేరన్నారు.

విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువ అని… ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రలో ఎక్కువ… రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు బాబూ..? అని నిలదీశారు. రాజకీయ సన్యాసం చేస్తావా లేక ఇంకా సన్నాసి రాజకీయాలు చేస్తావా చంద్రబాబూ..? బాబూ.. క్విట్ ఏపీ అని ప్రజలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా..?బాబు ఇక సీఎం కాలేడని పేర్కొన్నారు. 5 ఏళ్ళ బాబు పరిపాలన కన్నా 3 ఏళ్ళ జగన్ పరిపాలన వెయ్యి రెట్లు గొప్పగా ఉందని… రూ.1.39 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో వేసిన సీఎం జగన్ క్విట్ అవ్వాలా…!? అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news