రేపు కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

-

వరసగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటన చేస్తూ… వైఎస్సార్సీపీ పథకాలను ప్రారంభిస్తున్నారు. పథకాలతో వచ్చే లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే బహిరంగ సభల్లో ప్రతిపక్షం టీడీపీతో పాటు ఎల్లోమీడియా అంటూ పలు టీవీ ఛానెళ్లు, పేపర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా మరో జిల్లా పర్యటించనున్నారు సీఎం జగన్. రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టు పనులకు శంకుస్ధాపన చేసిన తర్వాత మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Latest news