ఏపీ మంత్రి కొడాలి నానికి క‌రోనా.. హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స‌

-

దేశ వ్యాప్తంగా కరోనా వైర‌స్ ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఈ మ‌ధ్య కాలంలోనే చాలా మంది ప్ర‌ముఖులు ముఖ్య రాజ‌కీయ నాయ‌కులు కరోనా బారిన ప‌డుతున్నారు. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి కూడా కరోనా వైర‌స్ సోకింది. దీంతో మంత్రి కొడాలి నాని క‌రోనా చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. కాగ గతంలో ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు కూడా కరోనా సోకిన స‌మ‌యంలో ఇదే ఆస్ప‌త్రి లో చికిత్స తీసుకున్నాడు.

Kodali-Nani

ప్ర‌స్తుతం మంత్రి కొడాలి నాని కూడా ఏఐజీ ఆస్ప‌త్రికే వ‌చ్చారు. కాగ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఏఐజీ ఆస్ప‌త్రి వైద్య వ‌ర్గాలు తెలిపాయి. అయితే మంత్రి కొడాలి నాని తో పాటు టీడీపీ నేత వంగ‌వీటి రాధా కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. వంగ‌వీటి రాధా కూడా హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే వంగవీటి రాధా కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం బాగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news