హరికృష్ణ చెప్పులు తుడుస్తూ బ్రతికిన చరిత్ర కొడాలి నానిది – బోండా ఉమ

-

మాజీ మంత్రి కొడాలి నానిపై టిడిపి నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ దగ్గర చెప్పులు తుడుస్తూ.. కాఫీ కప్పులు కడిగిన చరిత్ర కొడాలి నానిది అని విమర్శించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చిచ్చుపెట్టి కుటుంబాన్ని విడదీసిన ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పంచన చేరి గుడివాడ టికెట్ తీసుకొని ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పిచ్చి కుక్కలాంటి వాడని తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ నగరాన్ని వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఏంవివి సత్యనారాయణలు క్రైమ్, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారని విమర్శించారు. మిగిలిన వైసిపి నేతలు రాబందుల్లా ఆ ప్రాంతం పై పడి విలువైన భూములను కబ్జా చేస్తున్నారని.. భూ యాజమానులను రాబందుల్లా పీక్కుతింటున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. సీఎం ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news