పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్లతో స్కెచ్ – బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

-

వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ. ప్రభుత్వం పథకం ప్రకారమే ప్రతిపక్ష నేతలపై, పార్టీల అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హత్యకు రూ. 250 కోట్లతో స్కెచ్ వేశారని ఆరోపణలు చేశారు. రేక్కీ చేశారని తెలిపారు బోండా ఉమా. ఇందులో తాడేపల్లి హస్తం ఉందని అనుమానాలు ఉన్నాయన్నారు.

అలాగే నందిగామ పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారని.. మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ప్రాణాలు తీయాలనే నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రెడ్డి పాలన ఉందన్నారు బోండా ఉమ. చంద్రబాబుపై హత్యాయత్నం లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ హత్యకు సుపారి పైన విచారణ జరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news