BREAKING: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురుదెబ్బ

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై వైయస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పు పై గతవారం స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది.

దీంతో ఆయనను రేపటి వరకు అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలిగిపోయినట్లు అయింది. మరోవైపు అవినాష్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి చంచల్ గూడా జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news