విజయసాయిరెడ్డికి షాక్‌..బుద్దా వెంకన్న కేంద్రానికి లేఖ !

-

వైసీపీ రాజ్యసభ సభులు విజయసాయిరెడ్డికి షాక్‌ తగిలింది. వైసీపీ రాజ్యసభ సభులు విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేస్తూ బుద్దా వెంకన్న లేఖ రాశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు లేఖ రాసిన టీడిపి ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి పై ఆరోపణలను లేఖలో పొందు పరిచారు.

Buddha Venkanna’s letter complaining about Vijayasai Reddy

మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధుల మీద విజయసాయి చేసిన వ్యాఖ్యలను, దౌర్జన్యాన్ని వివరించారు బుద్దా వెంకన్న. పెద్దల సభ రాజ్యసభ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చే విధంగా వైవహరించారంటుంటూ ఫిర్యాదు చేశారు.. విజయసాయి పై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు బుద్దా వెంకన్న. మరి దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా విజయసాయి, శాంతి మధ్య సంబంధం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version