రజనీకాంత్‌పై YSRCP విమర్శలు.. చంద్రబాబు ఫైర్

-

ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రసంగం ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. రజనీ కాంత్ ప్రసంగంపై గత రెండ్రోజులుగా వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

‘‘అన్న గారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైఎస్సార్సీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై రజనీ కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైఎస్సార్సీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటి దురుసు గల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news