భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు : బొత్స సత్యనారాయణ

-

భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి గందరగోళ పరిస్థితి భక్తుల్లో కల్పించారని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు తన అబద్దాలను నిజం చేసుకోవడానికే తన మనుషులతో సిట్ వేసుకున్నారు. 

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ ఎక్కడ జరిగిందో చంద్రబాబు నిరూపించాలి. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. నెయ్యి కల్తీ పై చంద్రబాబు మాటలు చూస్తే.. జాలేస్తుంది. మాజీ సీఎం తిరుమలకు వెళ్తామంటే అడ్డుకోవడం దారుణం అన్నారు. తప్పు జరుగలేదు.. కాబట్టే మీరు సీబీఐకి లేఖ రాయడం లేదు. చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారు. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి..ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడికి కూడా వాడుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలి. సీబీఐ విచారణ జరపాలి. తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version